Hyderabad : రాజేంద్రనగర్ లో గంజాయి ముఠా కాల్పులు.. వెంటాడి పట్టుకున్న పోలీసులు
Rajendranagar: హైద్రాబాద్ రాజేంద్రనగర్ లో మంగళవారం పోలీసులపై గంజాయి ముఠా కాల్పులకు దిగింది.
Hyderabad: రాజేంద్రనగర్ లో గంజాయి ముఠా కాల్పులు.. వెంటాడి పట్టుకున్న పోలీసులు
Rajendranagar: హైద్రాబాద్ రాజేంద్రనగర్ లో మంగళవారం పోలీసులపై గంజాయి ముఠా కాల్పులకు దిగింది. నిందితులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల నుంచి పోలీసులు 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఉపయోగించిన కారును సీజ్ చేశారు. రాజేంద్రనగర్ లో పోలీసులకు గంజాయి ముఠా తారసపడింది. పోలీసులను చూసి ఈ ముఠా కాల్పులకు దిగి పారిపోయే ప్రయత్నం చేశారు. వెంటనే తేరుకున్న పోలీసులు నిందితులను వెంబడించి పట్టుకున్నారు.