Telangana: కరీంనగర్ లో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి గంగుల కమలాకర్

Update: 2020-01-24 11:27 GMT
గంగుల కమలాకర్ (ఫైల్ ఫోటో)

కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ర్ట మంత్రి గంగుల కమలాకర్ ఓటు వినియోగించుకున్నారు. మంత్రిగా తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోవడం.. కారు గుర్తుకు ఓటు వేయడం సంతోషంగా ఉందన్నారు గంగుల కమలాకర్. 70 శాతం పైగా టీఆర్ఎస్ కే ఓట్లు పడుతున్నాయని చెప్పారు.

ఎన్నికల్లో ఎవరు ఏ పార్టీకి ఓటు వేశామని బయటకు చెప్పినట్లయితే ఆ ఓటు చెల్లదని ఎన్నికల సంఘం అంటుంది. అంతే కాదు ఏపార్టీకి ఓటు వేసినట్లు చెప్పడం నేరమని ఎన్నికల అధికారి చెప్పారు. గంగుల కమలాకర్ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసినట్లు చెప్పినట్లు తమకు కంప్లైంట్ రాలేదని.. వస్తే చర్యలు తీసుకుంటామన్నారు.


Tags:    

Similar News