తెలంగాణలో కొత్తగా నలుగురికి కరోనా పాజిటివ్

Telangana: కేసులు నమోదవుతుండటంతో.. అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు

Update: 2023-12-20 01:52 GMT

తెలంగాణలో కొత్తగా నలుగురికి కరోనా పాజిటివ్

Telangana: తెలంగాణలో గడిచిన 24గంటల్లో కొత్తగా నాలుగు కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 402 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. నలుగురికి పాజిటివ్ గా నిర్ధారన జరిగింది. కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 9 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. దాదాపు 6నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్‌ బులిటెన్‌ విడుదల చేసింది. కేసులు నమోదవుతుండటంతో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

Tags:    

Similar News