సత్తుపల్లిలో వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన

Sattupalli: వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం కేసీఆర్ దృష్టిసారించారు, 58శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు పెరిగాయి.

Update: 2022-01-29 07:15 GMT

సత్తుపల్లిలో వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన 

Sattupalli: వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం కేసీఆర్ దృష్టిసారించారన్నారు మంత్రి హరీష్ రావు. మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని చెప్పారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో వంద పడకల ఆసుపత్రికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ కిట్‌లు వచ్చిన తర్వాత 58శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు పెరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో పాటు ఎంపీ నామా నాగేశ్వర్ రావు, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు.

Tags:    

Similar News