నిజామాబాద్ మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం రక్తదానం చేశారు. టీఆర్ఎస్ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రక్తదాన కార్యక్రమాలు నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు హైదరాబాద్లోని తన నివాసంలో రక్తదానం చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు వీలైనంత ఎక్కువగా రక్తదాన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. యువత రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని కవిత పిలుపునిచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారి ప్రాణాలను నిలుపవచ్చని, తలసేమియా, ఇతర అత్యవసర చికిత్సలకు సాయం అందించడానికి రక్తదానం చేసినట్లు తెలిపారు.
On the call of @trspartyonline working president @KTRTRS garu, donated blood for Thalassemia patients & others in medical emergencies#TRSFormationDay#20YearsOfTRS pic.twitter.com/xgZB37QrZe
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 1, 2020