ములుగు-భద్రాద్రి జిల్లాల సరిహద్దుల్లో పులుల కలకలం

* ఎదురుగుట్ట దగ్గర రెండు పులులు సంచారం * వీడియో తీసిన హైవేపై వెళ్తున్న ప్రయాణికులు * అటవీశాఖ అధికారులకు సమాచారం

Update: 2021-08-20 04:15 GMT

ములుగు-భద్రాద్రి జిల్లాల సరిహద్దుల్లో పులుల కలకలం (ఫైల్ ఫోటో)

Mulugu - Bhadradri : ములుగు-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లో పులుల కలకలం రేగింది. ఎదురుగుట్ట దగ్గర రెండు పులులు స్థానికుల కంటపడ్డాయి. హైవేపై వెళ్తున్న ప్రయాణికులు పులుల కదలికలను గుర్తించి తమ సెల్‌ఫోన్లలో బంధించారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన అధికారులు పశువుల కాపర్లు అటవీప్రాంతం వైపు వెళ్లొద్దని సూచించారు. పులులను బంధించేందుకు తగిన చర్యలు చేపట్టారు.

Tags:    

Similar News