విషాదం : మట్టి ఇల్లు కూలి ఐదుగురు మహిళలు మృతి

వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారంలో విషాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ప్రమాదావశత్తు ఇల్లు కూలి.. ఒకే కుటుంబానికి చెందిన 5గురు మహిళలు మృతి చెందారు.

Update: 2020-10-25 02:30 GMT

వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారంలో విషాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ప్రమాదావశత్తు ఇల్లు కూలి.. ఒకే కుటుంబానికి చెందిన 5గురు మహిళలు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.. పండగ రోజు గ్రామంలో విషాద చాయాలు అలుముకున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ఇంటిమిద్దె పూర్తిగా తడిసింది. దాంతో అది ఒక్కసారిగా కూలినట్టు తెలుస్తోంది. తమ బంధువు సంవత్సరీకం కోసం వచ్చిన కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తోన్న మనెమ్మ, సుప్రజ, ఉమాదేవి, వైష్ణవి, పింకి మట్టిపెళ్లలు పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.. 

Tags:    

Similar News