హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం

Update: 2020-01-23 05:30 GMT
హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ స్క్రాప్ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున మంటలు, పొగ ఎగిసిపడింది. 5 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపుచేసే ప్రయత్నం చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరగలేదు. కాగా, ఈ స్క్రాప్‌ గోదాంకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవు. సంబంధిత అధికారుల అండదండలతో ఈ గోదాం అక్రమ దందా కొనసాగుతున్నట్లు సమాచారం. 

Tags:    

Similar News