జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తారా ఇండస్ట్రీలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ మంటలు చుట్టు 3 కిలోమీటర్ల మేర దట్టమైన పొగలు అలుముకున్నాయి. రియాక్టర్లకు ఛార్జింగ్ పెడుతుండగా ప్రమాదం సంభవించింది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.