రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో అగ్నిప్రమాదం

Update: 2020-02-09 04:24 GMT
Representational Image

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఓ మొబైల్‌ షాపులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు నిమిషాల్లో షాపు మొత్తం అంటుకున్నాయి. మంటలు భారీగా చెలరేగడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. దీంతో చుట్టు పక్కల వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది... వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. 40 లక్షల రూపాయల నుంచి 50 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.


Tags:    

Similar News