అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
పంటలు సరిగ్గా పండక, పండిన కాస్త పంటలకు గిట్టు బాటు ధరలు లేక చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
పంటలు సరిగ్గా పండక, పండిన కాస్త పంటలకు గిట్టు బాటు ధరలు లేక చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో సగటున సగం మంది రైతులు అప్పుల బాధతోనే తనువు చాలిస్తున్నారు. ఇప్పుడు అదే అప్పుల బాధతో మరో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వివరాల్లోకెళితే సిద్దిపేట జిల్లా కొమురవెళ్లి మండలం తపసుపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తపసుపల్లికి చెందిన లకడబోయిన బాలయ్య (40) పంట కోసం చేసిన అప్పుల తీర్చలేక పోయాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబానికి పెద్దదిక్కు ఐన బాలయ్య ఆత్మహత్యతో ఆ కుటుంబంలో విషాదంలో మునిగింది. తమకింక దిక్కెవరంటూ రోదిస్తున్న ఆ కుటుంబం రోదనలు అందరిని కంటతడి పెట్టిస్తున్నాయి.