పాస్ బుక్ కోసం పెట్రోల్ బాటిల్ తో హల్ చల్

Update: 2019-11-07 12:18 GMT

మహబూబాబాద్ జిల్లా మరిపెడ MRO ఆఫీసులోకి ఓ యువరైతు పెట్రోల్ బాటిల్ తో రావడం స్థానికంగా కలకలం రేపింది. తన వ్యవసాయ భూమికి పట్టాదారు పాస్‌ బుక్‌లు ఇవ్వడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని రైతు ఆందోళన చేశాడు. ఎమ్మార్వో చాంబర్‌ లోపల హల్‌చల్‌ చేశాడు. మరిపెడ మండలం చల్లంచర్ల గ్రామానికి చెందిన యువ రైతు అశోక్‌ తన కుటుంబ సభ్యుల వివాదంలో తనకు దక్కాల్సిన వాటాకు పాస్‌ బుక్‌ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎమ్మార్వో, స్థానిక ఎస్సై సర్ది చెప్పడంతో అశోక్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

Tags:    

Similar News