పశువైద్యురాలు దిశ హత్య ఉదంతం రాష్ట్రంలో సంచలనాన్ని సృష్టించింది. ఈ సంఘటనపై చాలామంది స్పందించారు. దిశ కుటుంబానికి ధైర్యం చెప్పారు. కానీ కొంత మంది నెటిజన్లు మాత్రం ఈ సంఘటనపై బాధ్యతరాహిత్యంగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. కొంత మంది పెడుతున్న కామెంట్లు ఆడిపిల్లల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. బాధితురాలిని తన కుటుంబ సభ్యలను కించపరిచేలా ఉన్నాయి. అంతే కాకుండా అత్యాచారాలు, హత్యలు తప్పే కాదన్నట్టుగా కామెంట్లను పెడుతున్నారు.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో వచ్చే కామెంట్ల పై పోలీసు శాఖ ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. కామెంట్లు పెట్టిన వారిపై సత్వరమే చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్కు చెందిన స్టాలిన్ శ్రీరామ్ అతని స్నేహితులు ఫేస్బుక్లో ఒక గ్రూప్గా ఏర్పడ్డారు. వాళ్లందరూ దిశపై ఇష్టారీతిలో కామెంట్లు చేసారు. ఈ ఘటన పోలీసుల దృష్టికి రావడంతో సుమోటోగా కేసును స్వీకరించారు. అసభ్య కామెంట్లు పెట్టిన యువడిపై కేసు నమోదు చేసి మంగళవారం సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.