Etela Jamuna: ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డిపై ఈటల జమున తీవ్ర ఆరోపణలు

Etela Jamuna: ఈటల హత్యకు రూ.20 కోట్లు ఖర్చు చేస్తానని.. కౌశిక్‌రెడ్డి అన్నట్లు తెలిసింది

Update: 2023-06-27 09:22 GMT

Etela Jamuna: ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డిపై ఈటల జమున తీవ్ర ఆరోపణలు

Etela Jamuna: ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డిపై ఈటల రాజేందర్ సతీమణి జమున తీవ్ర ఆరోపణలు చేశారు. ఈటలను చంపేందుకు ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈటల హత్యకు 20 కోట్లు ఖర్చు చేస్తానని కౌశిక్‌రెడ్డి అన్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్‌ అండతోనే కౌశిక్‌రెడ్డి రెచ్చిపోతున్నరని...కౌశిక్‌రెడ్డి పిచ్చి చేష్టలకు కేసీఆరే బాధ్యత వహించాలని జమున అన్నారు. ఉద్యమకారులను కొట్టించిన వ్యక్తి కౌశిక్‌రెడ్డి అని... ఈటల రాజేందర్‌ వల్లే కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి వచ్చిందన్నారామే.

Tags:    

Similar News