పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ, పీజీ కళాశాల అడ్మినిస్ట్రేటర్ సాయి కృష్ణ పేర్కొన్నారు.
బద్వేల్ :ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ, పీజీ కళాశాల అడ్మినిస్ట్రేటర్ సాయి కృష్ణ పేర్కొన్నారు.మున్సిపాలిటీ పరిధిలోని విద్యానగర్ లో ఎన్ సీసీ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సత్యనారాయణ, అధ్యాపకులు, ఎన్ సీసీ క్యాండెట్ లు పాల్గొన్నారు.