Siddipet: సిద్ధిపేటలో ఎలక్ట్రికల్ స్మశాన వాటిక కేంద్రం ప్రారంభం

Siddipet: మనిషి ఆఖరి ప్రస్థానం మజిలీ అర్ధవంతంగా ఉండాలి-హరీష్ రావు

Update: 2021-11-07 02:57 GMT

Siddipet: సిద్ధిపేటలో ఎలక్ట్రికల్ స్మశాన వాటిక కేంద్రం ప్రారంభం

Siddipet: మనిషి తన ఆఖరి ప్రస్థానంలో ఆఖరి మజిలీ అర్థవంతంగా, గౌరవ ప్రదంగా జరిగేందుకు సిద్దిపేట లోని స్మశాన వాటిక లను పెద్ద ఎత్తున నిధులను వెచ్చించి దశల వారీగా పార్కులను తలపించేలా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. సిద్దిపేట పట్టణం ప్రశాంత్ నగర్ లో 27 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన ఎలక్ట్రికల్ స్మశాన వాటిక కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.

కట్టెల కొరతను అధిగమించడం, పొల్యూషన్ తగ్గించాలన్న ఉద్దేశంతో ఆధునిక పద్ధతులలో సిద్దిపేట పట్టణంలో రెండు లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఆధారిత దహన వాటికలను నిర్మించామని హరీష్ రావు తెలిపారు.

Tags:    

Similar News