సిరిసిల్లలో చిరుధాన్యాల ఫుడ్ ఫెస్టివల్

Sircilla: విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన

Update: 2022-09-24 02:08 GMT

సిరిసిల్లలో చిరుధాన్యాల ఫుడ్ ఫెస్టివల్

Sircilla: చిరుధాన్యాలతో వంటకాలు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని అధికార యంత్రాంగం అవగాహ‍న కల్పించే ప్రయత్నం చేసింది. సిరిసిల్లలో జిల్లా విద్యాశాఖ చిరుధాన్యాల ప్రాముఖ్యతను వివరించి, విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్ధేశంతో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ అన్ని వర్గాలవారిని ఆకర్షించింది. సామలు, కొర్రలు, అవిసెలు, జొన్నలు, ఊదలు, అరికెలు, సజ్జలు, రాగులు వంటి ధాన్యాలతో ఆరోగ్యానికి మంచి పోషకాలు అందిస్తాయని ఫుడ్‌ ఫెస్టివల్ ద్వారా వివరించే ప్రయత్నం చేశారు. ఫుడ్ ఫెస్టివల్‌లో విద్యార్థినులచేత తృణధాన్యాలతో రూపొందించిన ఆహార్ పదార్థాలు , వాటి ప్రయోజనాలను సందర్శకులకు వివరించారు.



Tags:    

Similar News