దుర్గం చెరువుకు కొత్త లుక్... భారీ స్థాయిలో వంతెన నిర్మాణం

Update: 2019-11-17 12:01 GMT
దుర్గం చెరువు

హైదరాబాద్ లో ఉన్న చెరువుల్లో ప్రఖ్యాతి గాంచిన మరో చెరువు దుర్గం చెరువు. ఈ దుర్గం చెరువును కూడా పర్యటక కేంద్రంగా మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. దాంతో పాటు ఈ చెరువుపై వంతెన నిర్మాణ పనులకు కూడా కొససాగిస్తుంది. ఈ చెరువుపై వంతెన నిర్మించడం ద్వారా చాలా మంది ఐటీ ఎంప్లాయిస్ ఐటీ కారిడార్ కు చేరుకునేందుకు చాలా సులువుగా ఉంటుంది.

ఇప్పటికే చాలా వరకు వంతెన పనులు కొనసాగుతున్నాయి. ఈ వంతెన నిర్మాణంలో బలమైన తీగెలను ఉపయోగిస్తున్నారు. ఈ వంతెన నిర్మాణ పనులకు సంబంధించిన ఫోటోలను మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఎంతో అందంగా భారీ స్థాయిలో నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జ్ పనులను వివిధ కోణాల్లో ఫొటోలు తీసి వాటిని ట్విట్ చేశారు.




Tags:    

Similar News