హైదరాబాద్ లో ఉన్న చెరువుల్లో ప్రఖ్యాతి గాంచిన మరో చెరువు దుర్గం చెరువు. ఈ దుర్గం చెరువును కూడా పర్యటక కేంద్రంగా మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. దాంతో పాటు ఈ చెరువుపై వంతెన నిర్మాణ పనులకు కూడా కొససాగిస్తుంది. ఈ చెరువుపై వంతెన నిర్మించడం ద్వారా చాలా మంది ఐటీ ఎంప్లాయిస్ ఐటీ కారిడార్ కు చేరుకునేందుకు చాలా సులువుగా ఉంటుంది.
ఇప్పటికే చాలా వరకు వంతెన పనులు కొనసాగుతున్నాయి. ఈ వంతెన నిర్మాణంలో బలమైన తీగెలను ఉపయోగిస్తున్నారు. ఈ వంతెన నిర్మాణ పనులకు సంబంధించిన ఫోటోలను మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఎంతో అందంగా భారీ స్థాయిలో నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జ్ పనులను వివిధ కోణాల్లో ఫొటోలు తీసి వాటిని ట్విట్ చేశారు.
The cable suspension bridge at Durgam Cheruvu, besides providing relief to lakhs of commuters is also going to be a wonderful addition to the city landscape 😊#HappeningHyderabad pic.twitter.com/v7C9rPmGPT
— KTR (@KTRTRS) November 17, 2019