Mahabubnagar: మద్యం మత్తులో పక్కింటికి ఎస్సై.. దొంగ అనుకుని చెట్టుకు కట్టేసి చితకబాదిన స్థానికులు..

Mahabubnagar: ఓ ఎస్సై మద్యం మత్తులో చేసిన పొరపాటు....స్థానికుల చేతిలో దెబ్బలు తినే పరిస్థితికి దారి తీసింది.

Update: 2022-12-01 13:45 GMT

Mahabubnagar: మద్యం మత్తులో పక్కింటికి ఎస్సై.. దొంగ అనుకుని చెట్టుకు కట్టేసి చితకబాదిన స్థానికులు..

Mahabubnagar: ఓ ఎస్సై మద్యం మత్తులో చేసిన పొరపాటు....స్థానికుల చేతిలో దెబ్బలు తినే పరిస్థితికి దారి తీసింది. మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ ఎస్ఐ మద్యం మత్తులో తన ఇంటికి బదులు వేరే ఇంటికి వెళ్లి తలుపు కొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఇంటి యజమాని దొంగ అనుకొని స్థానికులు సహాయంతో చెట్టుకు కట్టి చితకబాదారు. కాలనీ వాసుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చెట్టుకు కట్టేసిన ఎస్‌ఐని విడిపించారు. అయితే మద్యం సేవించిన వ్యక్తి ఎస్‌ఐ అని తెలియక పోవడం వలనే దాడి చేసినట్లు స్థానికలు తెలిపారు.

Tags:    

Similar News