ఇప్పటి వరకూ పోలీసులు నేరాలను అరికట్టడం కోసం అనేక రకాల సాంకేతిక పరికారాలను ఉపయోగించే వారు. వీటితో ఎన్నో సమస్యలను, నేరాలను అరికట్టిన పోలీసులకోసం మరో అధునాతన పరికరం అందుబాటులోకి వచ్చింది. నిర్మాణుష్యంమైన ప్రదేశాలలో జరిగే అసాంఘిక సంఘటనలను గురించి తెలుసుకోవడానికి ఈ డ్రోన్ లను ఉపయోగించనున్నారు. ఇప్పటి వరకూ సీసీ కెమెరాల ఆధారంగా చాలా మంది నేరస్తులను పట్టుకున్నారు.
ఈ మేరకు మహబూబాబాద్ జిల్లాకు మంజూరైన డ్రోన్ కెమెరాను ఎస్పీ కోటిరెడ్డి శుక్రవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, ధూమమానం చేసే వారు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించడంతో పాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం ఈ కెమెరాను ఉపయోగిస్తారని వారు తెలిపారు.