వరంగల్ రూరల్ జిల్లా వరికోల్లో పిచ్చి కుక్కలు రెచ్చిపోయాయి. కుక్కల దాడిలో 20 మంది గాయపడినట్లు తెలుస్తోంది. బాధితులు పరకాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో పిచ్చికుక్కలు పెరగడంతో.. రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నామని స్థానికులు చెబుతున్నారు.