హైదరాబాద్ ముషీరాబాద్లో ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసుల దాడి
డాక్టర్ జాన్పాల్ ఇంట్లో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్ బెంగుళూరు, ఢిల్లీ నుంచి డ్రగ్స్ తెచ్చి విక్రయాలు పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.3 లక్షలు ముగ్గురు స్నేహితులతో కలిసి డ్రగ్స్ వ్యాపారం మొదలు పెట్టిన జన్పాల్
హైదరాబాద్ ముషీరాబాద్లో ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసుల దాడి
వైద్య వృత్తితో రోగులకు ప్రాణం పోయాల్సిన వైద్యుడే ప్రాణాంతకమైన డ్రగ్స్కు బానిస అయ్యాడు. హైదరబాద్ ముషీరాబాద్లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ డ్రగ్ అమ్మకాలు జరుపుతున్న జాన్పాల్ను ఎస్టీఎఫ్బీ టీం అధికారులు పట్టుకున్నారు. ఈ డ్రగ్స్ను ముగ్గురు స్నేహితులతో కలిసి వ్యాపారం చేస్తున్నట్లు జన్పాల్ తెలిపారు. హైదరాబాద్కు చెందిన ప్రమోద్, సందీప్, శరత్ అనే ముగ్గురు వ్యక్తులు బెంగుళూరు, ఢిల్లీ నుంచి డ్రగ్స్ను తెప్పిస్తారని.. ఈ డ్రగ్స్ను అమ్మకాలు జరిపినందుకు డాక్టర్ జాన్పాల్ ఉచితంగా డ్రగ్స్ను వాడుకుంటూ, అమ్మకాలు జరుపుతున్నట్లు ఎస్టిఎఫ్ టీం లీడర్ ప్రదీప్ రావు తెలిపారు.