DK Aruna: ఇచ్చిన హామీలు కాంగ్రెస్ గాలికివదిలేసింది
DK Aruna: మూడో సారిప్రధానిగా మళ్లీ మోడీని గెలుస్తారు
DK Aruna: ఇచ్చిన హామీలు కాంగ్రెస్ గాలికివదిలేసింది
DK Aruna: అబద్దాల హామీలు ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటిని అమలు చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి పేరుతో కాలయాపన చేస్తుందని బీజేపీ నేతలు మండిపడ్డారు. నిజామాబాద్ రూరల్, ఆర్మూర్ నియోజకవర్గాల్లో బీజేపీ విజయసంకల్ప యాత్రలో పాల్గొన్న బీజేపీ నేతలు కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెలను అమ్ముకుంటే.. కాంగ్రెస్ మాత్రం ఏకంగా బర్రెలనే అమ్ముకునే బాపతు అని ఎద్దేవా చేశారు. మూడోసారి మోదీని ప్రధానిగా గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. విజయసంకల్ప యాత్రకు గ్రామ గ్రామాన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.