అర్థరాత్రి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోవడంపై వైద్యులతో మంత్రి ఈటల రాజేందర్ చర్చలు నిర్వహించారు . బకాయిలు చెల్లిస్తేనే ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తామని వైద్యులు చెప్పడంతో ఆమన చర్చలు నిర్వహించారు. హామీ కాకుండా బడ్జెట్ రిలీజ్ చేస్తేనే ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగిస్తామని... ప్రభుత్వం ఎప్పుడూ హామీలు మాత్రమే ఇస్తోందని వైద్యులు తెలిపారు.