Nalgonda జిల్లా కేతేపల్లిలో అపశృతి

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం గుడివాడ గ్రామంలో నిర్వహించిన అగ్నిగుండం కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది.

Update: 2020-02-22 07:29 GMT

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం గుడివాడ గ్రామంలో నిర్వహించిన అగ్నిగుండం కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. ప్రతి ఏడాది శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామంలోని పాత శివాలయం ద‍గ్గర కార్యక్రమాన్ని జరుపుతారు.

ఈ నేపథ్యంలో అగ్నిగుండంలో నడస్తుండగా తోపులాట జరిగి ప్రమాదవశాత్తు ఆరుగురు భక్తులు అగ్నిగుండంలో పడిపోయారు. వారిలో ఇద్దరి భక్తుల పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. అగ్నిగుండంలో నడుస్తుండగా భక్తులు ఒక్కసారిగా తోసుకోవడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని గ్రామస్తులు చెబుతున్నారు.


Tags:    

Similar News