Telangana: తెలంగాణలో తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు

కొత్తగా 465మందికి కరోనా నిర్ధారణ 24 గంటల్లో మరో నలుగురు కోవిడ్‌తో మృతి తెలంగాణలో 10,316 యాక్టివ్ కేసులు

Update: 2021-07-11 15:30 GMT

కరోనా వైరస్ (ఫైల్ ఫోటో)

Telangana: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 465 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో నలుగురు కోవిడ్‌తో మృతి చెందారు. ఇదే సమయంలో 869మంది కోవిడ్ నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన కేసులు 6లక్షల 31వేల 683కు చేరగా.. రికవరీ కేసుల సంఖ్య 6లక్షల 17వేల 638కు చేరింది. ఇక కోవిడ్ మృతుల సంఖ్య 3వేల 729కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 10వేల 316 యాక్టివ్ కేసులున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ‌ వెల్లడించింది.

Tags:    

Similar News