ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రైట్టెంది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో క్రికెట్ బెట్టింగ్ ముఠా పట్టుబడింది. ఆరుగురి అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుల నుంచి రూ.2.58 లక్షల నగదు, 12 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. మిర్యాలగూడలో ఉంటూ బెట్టింగ్ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు. ఎప్పటి నుంచో పోలీసులు వీరి కోసం నిఘా వేయగా బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈజీ మనీకి అలవాటుపడి క్రికెట్బెట్టింగ్లు ఆడుతూ జీవితాలు యువత నాశనం చేసుకోవద్దని, సక్రమ మార్గంలో కష్టపడి సంపాదించాలని పోలీసులు సూచించారు.