తెలంగాణలో మరో 38 మందికి కరోన పాజిటివ్

తెలంగాణలో గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది..

Update: 2020-05-21 15:22 GMT
Representational Image

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరుగుతున్నాయి.. గురువారం మరో 38 మందికి కరోన పాజిటివ్ అని తేలింది. దాంతో రాష్ట్రంలో కరోన పాజిటివ్ కేస్ ల సంఖ్య 1699కి చేరింది. ఒక్కరోజులోనే 5 గురు కరో నా తో మృతి చెందారు.. దాంతో మొత్తం మృతుల సంఖ్య 45 కి చేరింది. తాజాగా 23 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా... ఇప్పటి వరకు 1036 మంది కోలుకున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 618 యాక్టీవ్ కరోనా కేసులున్నాయి. గురువారం నమోదైన కరోనా కేసులలో 26 జిహెచ్ఎంసీ పరిధిలోవి కాగా, 2 రంగారెడ్డి, 10 మంది వలసదారులవిగా సర్కార్ ప్రకటించింది.




Tags:    

Similar News