Coronavirus Updates in Telangana: తెలంగాణలో కొత్తగా 2,381 పాజిటివ్ కేసులు...

Coronavirus Updates in Telangana | తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.

Update: 2020-09-25 03:37 GMT

Coronavirus Updates in Telangana | తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 57,621 నమూనాలు పరిశీలించగా కొత్తగా 2,381 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 10, మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 1080కి చేరింది. నిన్న ఒక్క రోజే 2,021 కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,81,627కి చేరింది. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన సంఖ్య 1,50,160కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,387యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.59శాతంగా ఉండగా, రికవరీ రేటు 81.67శాతంగా ఉందని వైద్యారోగ్య శాఖ వివరించింది. 24,592 మంది హోం ఐసోలేషనల్‌లో ఉన్నట్లు చెప్పింది. మొత్తం 27,41,836 టెస్టులు చేసినట్లు తెలిపింది. తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో 386, రంగారెడ్డిలో జిల్లాలో 227, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 193, నల్గొండలో 132, కరీంనగర్‌లో119కేసులు నమోదయ్యాయి.




 

Tags:    

Similar News