Coronavirus Updates in Telangana: తెలంగాణలో కొత్తగా 2,176 పాజిటివ్ కేసులు...

Coronavirus Updates in Telangana | తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.

Update: 2020-09-24 03:43 GMT

Coronavirus Updates in Telangana | తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 55,318 నమూనాలు పరిశీలించగా కొత్తగా 2,176 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 08, మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 1070కి చేరింది. నిన్న ఒక్క రోజే 2,004 కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,79,246కి చేరింది. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన సంఖ్య 1,48,139కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,037యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.59శాతంగా ఉండగా, రికవరీ రేటు 81.42శాతంగా ఉందని వైద్యారోగ్య శాఖ వివరించింది. 23,929 మంది హోం ఐసోలేషనల్‌లో ఉన్నట్లు చెప్పింది. మొత్తం 26,84,215 టెస్టులు చేసినట్లు తెలిపింది. తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో 308, రంగారెడ్డిలో జిల్లాలో 168, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 151, నల్గొండలో 136, కరీంనగర్‌లో120, సిద్దిపేటలో 95, భద్రాద్రి కొత్తగూడెంలో 88, ఖమ్మంలో 86, సూర్యపేటలో 82 కేసులు నమోదయ్యాయి.




Full View


Tags:    

Similar News