మాస్కు ధరించని యువకునికి రూ. 500 జరిమానా
కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ప్రజలంతా ప్రభుత్వం అమలు చేసిన నిబంధనలను పాటించాలని తెలిపింది.
కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ప్రజలంతా ప్రభుత్వం అమలు చేసిన నిబంధనలను పాటించాలని తెలిపింది. ప్రతి ఒక్కరు బయటికి వెళ్లేటప్పుడు మాస్కులు కట్టుకోవాలని, చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, సామాజిక దూరాన్ని పాటించాలని తెలిపింది. ఎవరైనా నిబంధనలు పాటించకపోతే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో కొన్ని పట్టణాల్లో, పల్లెల్లో నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. కరోనా వైరస్ ని తరిమికొట్టేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైనా కొత్తవారు ఇతర గ్రామాల నుంచి తమ గ్రామానికి వస్తే వారి పూర్తివివరాలను సేకరిస్తున్నారు.
అత్యవసరం అనుకుంటనే వారిని గ్రామంలోకి అనుమతిస్తున్నారు. ప్రజలంతా ఒకే తాటిపై ఉండి నిబంధనలను పాటిస్తున్నారు. ఎవరైనా అనుకోకుండా నిబంధనలు ఉల్లంఘిస్తే వారు మరో సారి అలాంటి పొరపాటు చేకుండా ఉండేందుకు జరిమానాలు విధిస్తున్నారు. ఈ కోణంలోనే ఇచ్చోడ మండలం ముఖ్రాకే గ్రామంలో ఓ యువకుడికి గ్రామ పెద్దలు రూ.500 జరిమానా విధించారు. రేషన్ బియ్యం తీసుకోవడానికి ఓ యువకుడు మాస్కు ధరించకుండా రావడాన్నిగమనించిన గ్రామ సర్పంచ్ మీనాక్షి అతనికి జరిమానా విధించింది. ప్రతి ఒక్కరు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి మాస్కులు తప్పనిసరి ధరించాలని ఆదేశించింది. ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించి.. కరోనాను తరిమికొట్టాల గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.