తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.. తాజాగా ఇవ్వాళ ఒక్కరోజే 61 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం 592 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం 472 మంది చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రంలో మొత్తం మీదా 103 డిశ్చార్జ్ అయ్యారు. 17 మంది మృతి చెందారు. ఇక జిల్లాలో వారిగా చూసుకుంటే ఒక్క గ్రేటర్ హైదరాబద్ పరిధిలోనే 216 కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత నిజామాబాద్ లో 35 కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 30 వరకు లాక్ డౌన్ ని పొడిగించిన సంగతి తెలిసిందే..
Media bulletin with district wise break up on status of positive cases of #COVID19 in Telangana (Dated: 13.04.2020) pic.twitter.com/0IWjCYWneC
— Minister for Health Telangana State (@TelanganaHealth) April 13, 2020