రేపు హైదరాబాద్‌ మెట్రో సర్వీసులు బంద్‌

Update: 2020-03-21 07:45 GMT
hyderabad metro

జనతా కర్ఫ్యూ నేపథ్యంలో రేపు హైదరాబాద్‌ మెట్రో సర్వీసులు బంద్‌ కానున్నాయి. మెట్రో మాల్స్‌ను కూడా మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 'జనతా కర్ఫ్యూ' పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌ మెట్రోరైల్‌ సేవలను ఆదివారం నిలిపివేస్తున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి 10 గంటల వరకు ప్యాసింజర్‌ రైళ్లు పట్టాలెక్కవని రైల్వే ప్రకటించింది.

Tags:    

Similar News