హైదరాబాద్లో చార్మినార్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆయుర్వేద ఆసుపత్రి తరలించవద్దంటూ డాక్టర్లు, విద్యార్థులు ధర్నా నిర్వహిస్తున్నారు. దీంతో భారీగా పోలీసులు మోహరించి ధర్నా నిర్వహిస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్ విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్ ఓ యువతిని కాళ్లతో తొక్కి గట్టిగా గోళ్లతో గిచ్చాడు. దీంతో ఆ విద్యార్థిని బాధతో విలవిలలాడింది. బాధ భరించలేక గట్టిగా కేకలు వేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కెమెరాల్లో రికార్డు అయ్యాయి. కానిస్టేబుళ్ల తీరుపై విద్యార్థినులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.