విజయశాంతి కాంగ్రెస్‎లోనే కొనసాగుతారు : కుసుమ కుమార్

కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి బీజేపీ గూటికి విజయశాంతి చేరుతుందన్న ఊహాగానాల నేపధ్యంలో ఆమెతో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్ భేటీ అయ్యారు

Update: 2020-10-28 14:45 GMT

కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి బీజేపీ గూటికి విజయశాంతి చేరుతుందన్న ఊహాగానాల నేపధ్యంలో ఆమెతో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్ భేటీ అయ్యారు. ఆమెతో భేటీ అనంతరం కుసుమ కుమార్ మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో విజయశాంతి దుబ్బాక ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదని, విజయశాంతి కాంగ్రెస్‎లోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. బీజేపీతో చర్చల ప్రస్తావన కూడా విజయశాంతితో రాలేదన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీ విజయశాంతిని గౌరవంగానే చూస్తోందని అన్నారు. పీసీసీ కూడా ఎన్నికల ప్రచారం కోసం రమ్మని అడిగారని అయితే ఆమె కోవిడ్ వల్ల రాలేనని చెప్పారని తెలిపారు.


Full View

Tags:    

Similar News