ప్రాణాలను లెక్కచేయకుండా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పోరాటం చేశారని కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ చర్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయన్నారు. 4 నెలలుగా భయపెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరినా పట్టించుకోకుండా స్పీకర్ ఒకేసారి బులెటిన్ విడుదల చేశారని విమర్శించారు. రేపు హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తామని వారు స్పష్టం చేశారు.