కేసీఆర్‌ తెలంగాణకు, జగన్‌ ఏపీకి అన్యాయం చేస్తున్నారు: వీహెచ్‌

Update: 2019-08-31 13:20 GMT

కేసీఆర్‌ తెలంగాణకు, జగన్‌ ఏపీకి అన్యాయం చేస్తున్నారని అన్నారు వీహెచ్‌. ప్రజలు యూరియా కావాలంటే కేసీఆర్ మాత్రం యురేనియం అంటున్నారని మండిపడ్డారు. యురేనియం తవ్వకాలు జరిపితే హైదరాబాద్‌ ప్రజలపై కూడా ప్రభావం పడుతుందని, కృష్ణా నీరు కలుషితం అవుతుందని, పంట, ప్రాణాలకు నష్టం జరుగుతందని తెలిపారు. వన్యప్రాణులను చంపితే నల్లమల్ల కనిపించకుండా పోతుందని, యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం రావాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌.

Tags:    

Similar News