హైదరాబాద్ పంజాగుట్టలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హనుమంతారావు హల్చల్ చేశారు. మంగళవారం తెల్లవారుజామున పంజాగుట్ట సర్కిల్లోని వైఎస్ విగ్రహం ఎదుట ఆందోళనకు దిగారు. ఇటీవల పంజాగుట్ట చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహాన్ని కూల్చేయగా అదే ప్లేస్లో విగ్రహాన్ని నెలకొల్పేందుకు వీహెచ్ ప్రయత్నించారు. అయితే దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించారు. దీంతో విగ్రహం కోసం పోలీసుల వెనుక నడిరోడ్డుపై పరుగులు పెట్టారు. లాభం లేకపోవడంతో వెనుదిరిగి ధర్నాకు దిగారు. రెండు గంటల్లో విగ్రహం తీసుకురావాలని లేకపోతే పంజాగుట్ట చౌరస్తాలో ఉన్న మిగతా విగ్రహాలను కూలుస్తామంటూ హెచ్చరించారు. వీహెచ్తో పాటు కార్యకర్తలను అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు.