ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుంది : పొన్నం
-ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ నేతలు -ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు -ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారు -ఇంత జరుగుతుంటే కార్మికశాఖ ఏం చేస్తోంది -హుజూర్నగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు సీపీఐ మద్దతు ఇవ్వొద్దు -టీఆర్ఎస్తో పొత్తు విరమించుకున్నాకే కార్మికులకు సీపీఐ మద్దతు ఇవ్వాలి -ఆర్టీసీ కార్మికులు ఇలాగే ఐక్యంగా ఉండాలి
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మాజీ మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సంఘీభావం తెలిపారు. సమ్మెకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు పొన్నం అన్నారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని, ఇంత జరుగుతున్నా.. కార్మికశాఖ ఏం చేస్తోందని పొన్నం ప్రశ్నించారు. హుజూర్నగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు సీపీఐ మద్దతు ఇవ్వొద్దుని, టీఆర్ఎస్తో పొత్తు విరమించుకున్నాకే కార్మికులకు సీపీఐ మద్దతు ఇవ్వాలని కోరారు. ఆర్టీసీ కార్మికులు ఇలాగే ఐక్యంగా ఉండాలని సూచించారు పొన్నం ప్రభాకర్.