మునుగోడుపై కాంగ్రెస్ ఫోకస్

Congress: ఇవాళ చండూరులో ముఖ్య కార్యకర్తల సమావేశం

Update: 2022-08-05 02:39 GMT

మునుగోడుపై కాంగ్రెస్ ఫోకస్ 

Congress: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేస్తానని ప్రకటించడంతో మునుగోడుపై తెలంగాణ కాంగ్రెస్‌ ఫోకస్ పెట్టింది. ఇవాళ చండూరులో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. సుమారు 30వేల మంది కార్యకర్తలతో సమావేశంలో పాల్గొననున్నారు. సభకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుందూరు జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి, సీతక్క, మల్లు రవి, మధు యాష్కీ, అంజన్ కుమార్ తో పాటు మరికొంత మంది నేతలు హాజరుకానున్నారు. ఈ సభలో మునుగోడు, నల్గొండ, నకిరేకల్, నాగార్జున సాగర్ నియోజక వర్గాలకు చెందిన పార్టీ శ్రేణులు పాల్గొననున్నాయి. అయితే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి సమావేశానికి హాజరుపై సస్పెన్షన్ నెలకొంది.

Tags:    

Similar News