రాజగోపాల్‌తో చర్చలకు ఏఐసీసీ దూతగా ఉత్తమ్‌

*పార్టీ మారకుండా రాజగోపాల్‌ను ఒప్పించే బాధ్యత ఉత్తమ్‌కు అప్పగింత

Update: 2022-07-28 04:53 GMT

రాజగోపాల్‌తో చర్చలకు ఏఐసీసీ దూతగా ఉత్తమ్‌

Komatireddy Rajagopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో చర్చలు జరపాలని కాంగ్రెస్‌ నిర్ణయించుకుంది. రాజగోపాల్‌రెడ్డి పార్టీ మార్పుపై ఏఐసీసీ పెద్దలు నిన్న భేటీ అయ్యారు. ఈ భేటీలో రాజగోపాల్‌తో చర్చలకు ఏఐసీసీ దూతగా ఉత్తమ్‌ను ఎన్నుకున్నారు. రాజగోపాల్‌ పార్టీ మారకుండా ఒప్పించే బాధ్యతలను ఉత్తమ్‌కు అప్పగించారు. దీంతో ఈ శనివారం రాజగోపాల్‌రెడ్డితో ఉత్తమ్‌కుమార్‌ భేటీ కానున్నారు. 

Tags:    

Similar News