గాంధీభవన్లో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం అయ్యింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి, వీహెచ్, షబ్బీర్ అలీ భేటీ అయ్యారు. ముఖ్యంగా హుజూర్నగర్ ఉప ఎన్నికలో ఓటమి, రాబోయే మున్సిపల్ ఎన్నికలపై చర్చించారు. ఈ సందర్భంగా హుజూర్నగర్ ఓటమికి పూర్తి బాధ్యత తనదే అని పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో సీనియర్ నాయకుడు వీహెచ్ పార్టీ పరిస్థితి, క్రమశిక్షణపై ప్రశ్నించారు. కార్యకర్తలతో సీఎం అనిపించుకోవడంపై అసహనం వ్యక్తం చేశారు. వైఎస్ కూడా సీఎం కాకముందు కార్యకర్తలతో సీఎం అని అనిపించుకోలేదని క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపట్ల కఠినంగా ఉండాలని వీహెచ్ సూచించారు.