Alleti Maheshwar Reddy: రేవంత్‌ సరదా కోసం వంద కోట్ల ప్రజాధనం దుర్వినియోగం

Alleti Maheshwar Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేఎల్పీ (BJLP) నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Update: 2025-12-11 11:11 GMT

Alleti Maheshwar Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేఎల్పీ (BJLP) నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఫుట్‌బాల్ ఆడటం వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేవలం తన సరదా కోసం ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.

సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ ఆట కోసం వంద కోట్లకు పైగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఏలేటి విమర్శించారు. ఈ ఫుట్‌బాల్ ఆట కోసం సింగరేణి సంస్థ నిధులను ఖర్చు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

"ఇవే డబ్బులను సింగరేణిలో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడానికి, కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయవచ్చు కదా?" అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వ్యక్తిగత ఆసక్తి కోసం ప్రభుత్వ నిధులను వినియోగించడంపై బీజేపీ నేత చేసిన ఈ విమర్శలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Tags:    

Similar News