గవర్నర్ నరసింహన్, సీఎం ఫడ్నవీస్‌కు సీఎం కేసీఆర్ స్వాగతం

Update: 2019-06-21 05:39 GMT

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఏపీ సీఎం జగన్ మేడిగడ్డ వద్దకు చేరుకున్నారు. వీరికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శాలువాలు కప్పి స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ నరసింహన్, సీఎంలు జగన్, దేవేంద్ర ఫడ్నవీస్ కలిసి కేసీఆర్‌తో పాటు హోమంలో పాల్గొన్నారు. మేడిగడ్డ దగ్గర కేసీఆర్ దంపతులు హోమంలో పాల్గొన్నారు. కాగా ప్రస్తుతం మేడిగడ్డ వద్ద జలసంకల్ప హోమం కొనసాగుతోంది. శృంగేరీపీఠం అర్చకుల ఆధ్వర్యంలో జలసంకల్ప హోమం జరుగుతోంది.

Tags:    

Similar News