లష్కర్ బోనాలు వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారికి బోనం సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. తెల్లవారుజామునే వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి దర్శించుకుంటున్నారు. సికింద్రాబాద్ శ్రీ మహంకాళీ అమ్మవారిని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, పండితులు సీఎంకు పూర్ణకుంబంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.