నేడు మేడ్చల్‌ జిల్లాకు సీఎం కేసీఆర్

CM KCR: జిల్లా కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభించనున్న కేసీఆర్

Update: 2022-08-17 01:19 GMT

నేడు మేడ్చల్‌ జిల్లాకు సీఎం కేసీఆర్

CM KCR: నేడు సీఎం కేసీఆర్ మేడ్చల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం అంతాయిపల్లి సిద్ధమైంది. అంతాయిపల్లిలో కొత్తగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్‌ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు సర్వం సిద్ధం చేశారు. 30 ఎకరాల్లో 56కోట్ల 20లక్షల రూపాయలతో కలెక్టరేట్‌ భవనాన్ని నిర్మించగా.. సీఎం కేసీఆర్ పర్యటనకు పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇక సీఎం కేసీఆర్ జిల్లాకు ఎలాంటి వరాలు ప్రకటిస్తారోనని ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News