హైదరాబాద్‌లో బంజారా భవన్‌లను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

*ఈనెల 17న జరగనున్న కార్యక్రమం

Update: 2022-09-11 11:39 GMT

హైదరాబాద్‌లో బంజారా భవన్‌లను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

Hyderabad: ఈనెల 17న సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో రెండు బంజారా భవన్‌లను ప్రారంభించనున్న నేపథ్యంలో మంత్రులు ఏర్పాట్లను పరిశీలించారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల బంజారా హిల్స్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బంజారా భవన్, ఆదివాసీ భవన్‌లను సీఎం ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీమతి సత్యవతి రాథోడ్‌లతో పాటు స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏర్పాట్లను పరిశీలించారు. 

Tags:    

Similar News