సీఏఏపై శాసనసభలో చర్చ జరగాలి: సీఎం కేసీఆర్‌

Update: 2020-03-07 06:57 GMT
సీఏఏపై శాసనసభలో చర్చ జరగాలి: సీఎం కేసీఆర్‌

సీఏఏపై శాసనసభలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సీఏఏను వ్యతిరేకిస్తూ తీర్మానం చేశాయని ఆయన చెప్పారు. తాము సీఏఏను పార్లమెంటులోనే వ్యతిరేకించామని ఆయన గుర్తు చేశారు. దేశ భవిష్యత్తుపై ఆధారపడిన అంశమిదని ఆయన అన్నారు. చర్చ ఒక రోజులో పూర్తయ్యేది కాదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలుంటాయని, అందరి అభిప్రాయాలు వినాల్సి ఉందని ఆయన అన్నారు. సీఏఏపై చర్చకు అందరికీ అవకాశం కల్పించాలని స్పీకర్‌ను కోరుతున్నానని సీఎం అన్నారు.


Full View


Tags:    

Similar News