Etela Rajender: ఈటల రాజేందర్ ఢిల్లీ టూర్‌పై గులాబీ బాస్ సీరియస్

Etela Rajender: బీజేపీ అగ్రనేతలతో ఈటల మీటింగ్‌లపై ఆరా తీస్తున్న కేసీఆర్ *జూన్ 2 తర్వాత ఈటలపై వేటుకు టీఆర్ఎస్ రంగం సిద్ధం

Update: 2021-06-01 07:24 GMT

సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

Etela Rajender: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీ టూర్‌పై గులాబీ బాస్ సీరియస్ అయ్యారు. ఢిల్లీలో ఈటల బీజేపీ అగ్రనేతలతో మీటింగ్‌పై సీఎం కేసీఆర్ ఆరా తీస్తున్నారు. జూన్ 2 తర్వాత ఈటల పై వేటుకు టీఆర్ఎస్ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ నుంచి సస్సెండ్ చేయడంతో పాటు ఎమ్మెల్యే పదవిపై కూడా స్పీకర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. ఈటల రాజేందర్‌తో పాటు బీజేపీ నేతలకు టచ్‌లో ఉన్న మిగతా నేతలపై కూడా వేటు వేయనున్నారు. ఇప్పటికే హుజురాబాద్‌లో ప్రత్యేక శిబిరాన్ని టీఆర్ఎస్ ఏర్పాటు చేసింది.

Tags:    

Similar News