CM KCR: ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్

CM KCR: మూడు రోజులపాటు ఢిల్లీలోనే మకాం

Update: 2022-07-26 00:58 GMT

CM KCR: ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్

CM KCR: సీఎం కేసీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. మూడు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. జాతీయ రాజకీయాల్లో పెనుమార్పులకు శ్రీకారం చుట్టబోతున్నానని ఇటీవల ప్రకటించారు. జాతీయ స్థాయిలో రాజకీయ నాయకులను కలిసి భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నట్లు సమాచారం. రాజకీయ సమీకరణలపై వివిధ పార్టీలకు చెందిన నాయకులతో భేటీకాబోతున్నారు. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానంతరం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

Tags:    

Similar News